చీరాల టిడిపి ఎమ్మెల్యే కొండయ్య రద్దు చేసుకున్న కార్యక్రమాన్ని అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు కొనసాగిస్తున్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గొల్లపాలెంలో స్మశాన వాటిక ప్రహరీ గోడకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయాల్సి ఉండగా ఆయన ఆకస్మాత్తుగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న డాక్టర్ పాలేటి చొరవ తీసుకొని గురువారం ప్రహరీ గోడ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు.