ప్రజా దర్బార్ నిర్వహించిన చీరాల ఎమ్మెల్యే

64చూసినవారు
ప్రజా దర్బార్ నిర్వహించిన చీరాల ఎమ్మెల్యే
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తామని చీరాల ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. శుక్రవారం ఆయన టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి స్వయంగా అర్జీలు సేకరించారు. కొన్ని సమస్యలపై ఆయన అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరింపజేశారు. మిగతా సమస్యలను కూడా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. దాదాపు 750 అర్జీలు ఎమ్మెల్యేకి అందాయి. యువనేత అమర్నాథ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్