తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు చేసిన అవినీతి ఆరోపణల మీద ఎలాంటి విచారణకైనా సిద్ధమని చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు చెప్పారు. సిబిసిఐడి లేదా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ఏసీబీ తనపై విచారణ చేయాలని ఆయనే శుక్రవారం మీడియా సమావేశంలో కోరారు. తన హయాంలో దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని, వీటిలో ఏదైనా అవినీతి జరిగి ఉంటే దర్యాప్తు సంస్థలు రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు.