చీరాల నియోజకవర్గంలో దివ్యాంగులు సదరం పత్రాలు కోసం ముందస్తు స్లాట్లు కొరకు గ్రామ సచివాలయాలలో నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కొండయ్య శుక్రవారం తెలియజేశారు. జులై ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో పరీక్షలు చేయించుకోవడానికి నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.