ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ టిడిపి కూటమి ప్రభుత్వం పేదలకు తక్షణం నివేశన స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం చీరాలలో భారీ ర్యాలీ జరిగింది. ఒక్క చీరాల మండల పరిధిలోనే దాదాపు 600 మంది నిరుపేదలు ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు పెట్టుకుంటే ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని సిపిఐ నేతలు ధ్వజమెత్తారు. ఏరుదాటాక తెప్పను తగలేసిన చందంగా పాలకుల తీరు ఉందని విమర్శించారు.