ఎస్సీల వర్గీకరణకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో చీరాల నియోజకవర్గానికి చెందిన టిడిపి దళిత నేతలు సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే కొండయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. దళిత వర్గాలకు సమన్యాయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వర్గీకరణ కారణంగా 59 దళిత కులాలకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వారు తెలిపారు. ఎమ్మెల్యే కొండయ్య సహకారాన్ని వారు కొనియాడారు.