చీరాల: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుని మృతి

83చూసినవారు
చీరాల: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుని మృతి
లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చీరాల- వేటపాలెం బైపాస్ రోడ్ లో జరిగింది. చీరాలకి చెందిన కుంచాల సురేష్ కూలి పని నిమిత్తం మిత్రుడి బైక్ పై వేటపాలెం వెళుతుండగా మార్గమధ్యంలో ఒక లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా గుంటూరుకు రిఫర్ చేశారు. అక్కడికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

సంబంధిత పోస్ట్