వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని ఆమోదగిరి పట్నం చెందిన ఆనంద్ రోడ్డు కాంట్రాక్టర్ తన స్థలంలో ఉన్న కారు పై కాంక్రీట్ వేసి సిమెంటు రోడ్డు నిర్మించాడని మంగళవారం వాపోయాడు. దీంతో తన కారు రోడ్డులో కురుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొలతలు వేయకుండా తన సొంత స్థలంలో రోడ్డు వేయటం ఏమిటని ఆనంద్ ఆరోపించారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.