గుంటూరు ఆర్. అగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం శాఖంబరి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు.