జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ కాల్పుల్లో మరణించిన జవాన్ మురళీ నాయక్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం ఓ ప్రకటనలో అన్నారు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలర్పించడం బాధాకరమని, ఆయన త్యాగాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మురళీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పహల్గామ్ ఘటనకు కారణమైన పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు ఆపాలన్నారు.