గుంటూరు జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణ, భూములపై అక్రమాలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ZP ఛైర్ పర్సన్ క్రిస్టినా స్పష్టం చేశారు. మంగళవారం ZPలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కల్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్ ల అద్దె బకాయిలు వెంటనే వసూలు చేయాలన్నారు. అనంతరం సీఈఓ జ్యోతిబసు ఆదాయ వనరులపై సమీక్ష నిర్వహించారు.