గుంటూరు జిల్లాలో విస్తృత తనిఖీలు

57చూసినవారు
గుంటూరు జిల్లాలో విస్తృత తనిఖీలు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో లాడ్జీలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తనిఖీలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో వాహనాలు తనిఖీ చేసి అనుమానితులను వేలిముద్రల ద్వారా గుర్తించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్