గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్, బృందావన్ గార్డెన్స్ 6వ లైన్ లోని అన్నమయ్య పార్కులో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి గురువారం తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా పార్కు చుట్టూ భద్రతను పర్యవేక్షించడమే కాక, పార్కు యొక్క అందం, నిర్వహణను మెరుగుపరచడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.