గుంటూరు: జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు ఈ నెల 20న సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నట్లు కార్మిక సంఘాల సమన్వయ సమితి ప్రకటించింది. గురువారం డిప్యూటీ లేబర్ కమిషనర్కు సమ్మె నోటీసు అందజేశారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని ఆరోపించిన నేతలు, కార్మికుల హక్కుల కోసం అందరూ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.