గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మంటలు వ్యాపించి దేవుడి మాన్యం 12 ఎకరాల మొక్కజొన్న కండెలు కాలి బూడిదైన ఘటన గురువారం చోటుచేసుకుంది. పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఓ రైతుకు కాలిన గాయాలయ్యాయి. దాదాపు రూ.7 లక్షలకు పైగా నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ మంటలు పక్క పొలాలకూ వ్యాపించడంతో మరో ముగ్గురు రైతులకు చెందిన మొక్కజొన్న కండెలు సైతం కొంతమేర కాలిపోయాయి, నష్టపరిహారం అందించి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.