గుంటూరులో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందితో పలు ప్రాంతాల్లో ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. సంగడిగుంట, పొన్నూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ తీగల వల్ల జరిగే అగ్ని ప్రమాదాలపై మాక్డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు.ప్రచార వాల్పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేశారు. ఫైర్ స్టేషన్ అధికారి పి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.