గుంటూరు సంపత్ నగర్కు చెందిన సుభానీ భాషా (వయసు 39) మే 28న ప్రభుత్వ హాస్పిటల్ ముందు పడి అక్కడికి చేరిన పోలీసులు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మే 31న మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహం ప్రస్తుతం జీజీహెచ్ మార్చురీలో ఉంది. బంధువులు ఇప్పటివరకూ రాలేకపోవడంతో, అతడిని గుర్తించిన వారు కొత్తపేట పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని అధికారులు కోరారు.