గుంటూరు జిల్లాలోని అడవితక్కెళ్లపాడులో గుడిసెలను బలవంతంగా తొలగించిన రాష్ట్రానికి చెందిన డిప్యూటీ కలెక్టర్ మోహనరావును తహసీల్దార్ గా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గానూ రూ.1లక్ష జరిమానా విధించి 4 నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది. డిమోట్ విషయంలో అతని తరపు న్యాయవాది సమయం కోరడంతో కేసు మళ్లీ వాయిదా పడింది.