గుంటూరు: సయ్యద్ వలీపై చర్యలు తీసుకోవాలని ధర్నా

56చూసినవారు
గుంటూరు బుద్ధ యోగ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ సయ్యద్ వలీపై చర్యలు తీసుకోవాలని గురువారం బాధితులు ఎస్పీ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. యోగ టీచర్ల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి, చెల్లించాల్సిన జీతాలు, ఉద్యోగం కోసం ఇచ్చిన డబ్బులు బాధితులకు ఇప్పించాలని ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. రూ. 40కోట్లకు టోకరా పెట్టారని బాధితులు విన్నవించుకున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు.

సంబంధిత పోస్ట్