వార్డుల్లో ప్రతి సమస్యకూ పరిష్కారం చూపే విధంగా ముందడుగు వేస్తున్నామని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. మంగళవారం గుంటూరు నగరంలోని కొబ్బరికాయల సాంబయ్య కాలనీలో పర్యటించి శానిటేషన్, మంచినీటి సరఫరా, రోడ్లు వంటి సమస్యలపై స్థానికులతో మాట్లాడి, స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.