రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ ఫోర్స్ మెంట్ పరిధిని విస్తృతం చేయాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. రామన్నపేటలోని జన చైతన్య వేదిక హాలులో శనివారం వారు మాట్లాడారు. నాటుసారా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.