అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నాన్ పొలిటికల్ జేఏసీ హెచ్చరించింది. రాజధానిపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ శనివారం లాడ్జ్ సెంటర్లో దీక్ష నిర్వహించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, సీఎం జగన్ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు.