రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడిగా తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ను నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నసీర్ ఇప్పటికే రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. హజ్ యాత్రికుల సౌలభ్యత కోసం, హజ్ హౌస్ నిర్మాణాభివృద్ది కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. చంద్రబాబు, కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు తగు న్యాయం చేస్తుందన్నారు.