రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ బుధవారం సీఎం చంద్రబాబుని కలిశారు. తాను కమీషన్ చైర్మన్ గా నియమితులైనందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల హక్కుల పరిరక్షణ, భద్రత, సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంఘీభావం తెలుపుతూ, తన వంతు సేవ అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు.