గుంటూరు: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల

65చూసినవారు
గుంటూరు: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల
వైసీపీ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు దేవినేని అవినాష్ కూడా విచారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వచ్చారు. కోర్టు రోడ్డు వద్దే సజ్జల వాహనాన్ని పోలీసులు నిలిపేయడంతో ఆయన సీఐడీ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లారు.

సంబంధిత పోస్ట్