పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న చల్లా వెంకటరెడ్డి (62) బుధవారం గుంటూరు డీఈఓ కార్యాలయానికి పీఎఫ్, ఎన్ఐసీ క్లియరెన్స్ కోసం వచ్చి గుండెపోటుతో మృతి చెందారు. జూన్లో రిటైర్ కావాల్సిన ఆయన అకాలమరణంతో తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.