10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డీఆర్వో ఖాజావలి అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఈ నెల 19 నుంచి 28 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు 4, 224 మంది, ఇంటర్ పరీక్షలకు 971 మంది హాజరవుతారని తెలిపారు.