హిమాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ప్రబోధ్ సక్సేనా, డా. బసు సూద్ గురువారం అమరావతిలో పర్యటించారు. సీఆర్డీఏ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు అమరావతి అభివృద్ధిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. భూ సమీకరణ, ఎకో ఫ్రెండ్లీ నిర్మాణాలు, థీమ్ సిటీలపై వివరాలు వెల్లడించారు. అనంతరం ఉండవల్లి గుహలు, వీఐటీ క్యాంపస్ ను సందర్శించారు.