వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సివిల్స్ అభ్యర్థుల కోసం 30 నెలల ఉచిత శిక్షణ పథకాన్ని బుధవారం ప్రకటించారు. లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ సహకారంతో ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళా అభ్యర్థుల్లో 10మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి, ఉచితంగా కోచింగ్, వసతి, భోజన సదుపాయాలు అందించబడతాయి. పరీక్ష సీతారామపురం ఐనవోలులోని ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనంలో జరగనుంది.