సాంకేతిక విద్యా శిక్షణ మండలి బుధవారం విడుదల చేసిన పాలిసెట్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు విశేష ప్రతిభ చూపారు. మొత్తం 4, 129 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2, 497 మంది బాలురు, 1, 511 మంది బాలికలు ఉన్నారు. ఫలితాల ప్రకారం బాలుర ఉత్తీర్ణత శాతం 96. 52% కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 97. 99% గా నమోదైంది. జిల్లాలో మొత్తం ఉత్తీర్ణత శాతం 97. 07%గా నమోదు కావడం గమనార్హం.