సూపర్ సిక్స్లో కీలక హామీని అమలు చేస్తున్నామని మంత్రి లోకేశ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల తల్లుల అకౌంట్లు యాక్టివ్ లేకుంటే యాక్టివ్ చేసుకోమని చెబుతున్నామని వివరించారు. వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ తీసుకొస్తున్నామని వెల్లడించారు. 9600 పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ అమలు చేస్తున్నామన్నారు. మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు సన్నబియ్యం అమలు చేస్తున్నామని మంత్రి లోకేశ్ ప్రకటించారు.