గుంటూరు జీజీహెచ్ లో ఓపి కేంద్రాల వద్ద బారులు తీరిన రోగులు

54చూసినవారు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఓపీ విభాగం సర్వర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రోగులు బారులు తీరారు. ప్రభుత్వ వైద్యశాలలో రోగులు, వారి సహాయకులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కూర్చోవడానికి కుర్చీలు కూడా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు రోగులను వారి సహాయకులు స్ట్రైక్చర్లపై తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్న పరిస్థితి అక్కడ కనిపించింది.

సంబంధిత పోస్ట్