ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలు విజయం సాధించాలని బీజేపీ వినుకొండ శాఖ పుట్టా బత్తుని ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించింది. సైనికుల సేవలను కొనియాడారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. దేశ క్షేమం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని నాయకులు కోరారు. సైనికులు దేశ సరిహద్దులను కాపాడుతూ రాత్రింబగళ్లు కష్టపడుతున్నారని, వారి త్యాగాలను ఎప్పటికీ మరచిపోకూడదని అన్నారు.