అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కేసు నమోదు అయింది. పాత గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణ నగర్ లో నివాసం ఉండే శ్రీనివాసరావు గత కొంతకాలం గా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కుమారుడు సాయికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.