అమరావతి మహిళలపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రైతులు, మహిళలు, తుళ్లూరు, మందడం గ్రామాల్లో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతలపై, వారిని ప్రోత్సహిస్తున్న మీడియాపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.