నారాకోడూరు నుంచి నిజాంపట్నం పోర్టు వరకు 47. 8 కి. మీ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ ప్రాజెక్టుకు రూ. 1, 391 కోట్ల వ్యయం అవుతుందని DPRలో పేర్కొన్నారు. ప్రాజెక్టులో, సామాజిక ప్రభావం తక్కువగా ఉండే నాలుగో ఎలైన్మెంట్ను కన్సల్టెన్సీ సంస్థ ప్రతిపాదించింది. ఈ మార్గం సూర్యలంక ఎయిర్బస్, నిజాంపట్నం పోర్టుతో మెరుగైన కనెక్టివిటీని కల్పించడంతో పాటు, ట్రాఫిక్ ఒత్తిడి తగ్గేందుకు దోహదపడనుంది. ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.