గుంటూరులో 19న ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రం ప్రారంభం: కమిషనర్

71చూసినవారు
గుంటూరులో 19న ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రం ప్రారంభం: కమిషనర్
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు కమిషనర్ పులి శ్రీనివాస్ గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. వినియోగానికి అనర్హమైన పాత ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రానికి అందజేసిన వారికి నగదు ప్రోత్సాహం అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సరిగ్గా నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, శుభ్రతకు తోడ్పడాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్