బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధనకు బీజేపీ కృషి చేస్తోందని గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు తిరుపతిరావు తెలిపారు. గురువారం చంద్రమౌళీ నగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అంబేడ్కర్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికై ఈనెల 18న రాజేంద్రనగర్ లో మేధావులతో సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధీశ్వరి పాల్గొంటారని తెలిపారు.