గుంటూరులో బుద్ధ యోగ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ సయ్యద్ వలీపై చర్యలు తీసుకోవాలంటూ గురువారం బాధితులు ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. యోగ టీచర్లకు ఉద్యోగాలు కల్పిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసినప్పటికీ, వారు అందవలసిన జీతాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. మొత్తం రూ.40 కోట్ల మేర మోసం చేశారని వారు పేర్కొన్నారు.