గుంటూరు పట్టణంలోని బీఆర్ స్టేడియంలో ప్రహరీగోడ నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. స్టేడియంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా స్టేడియంని అభివృద్ధి చేస్తామని, ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.