గుంటూరు: మెగా జాబ్ మేళాను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

84చూసినవారు
గుంటూరు: మెగా జాబ్ మేళాను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంట మలలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈ మేళాను ప్రారంభించారు. నిరుద్యోగులు అధిక సంఖ్యలో జాబ్ మేళాకు తరలివచ్చారు. ఈ మేళాలో జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్, పత్తిపాడు ఎమ్మెల్యే బుర్రా రామాంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్