పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో అమరుడైన సైనికుడు మురళి నాయక్ చిత్రపటానికి గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో శనివారం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరి శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ. పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యలు ఇప్పుడు కాదని గత 30 సంవత్సరాలుగా జరుగుతుందన్నారు. మేము రిటైర్డ్ అయిన పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.