విజయవాడలో ఎడిటర్ ధనంజయ రెడ్డిపై పోలీసులు చూపిన దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ, గుంటూరు లాడ్జి సెంటర్ వద్ద జర్నలిస్ట్ సంఘాలు గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆచారి, విలేఖరి నాని మాట్లాడుతూ.. మీడియా ప్రతినిధులపై దాడులు సమాజానికి మంచిది కాదని, ఇది పత్రికాస్వేచ్ఛను హరించే చర్యగా అభివర్ణించారు. హక్కుల రక్షణ కోసం భవిష్యత్తులో ఉమ్మడి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.