గుంటూరులోని లాలాపేటలో తూనుగుంట్ల వీధికి చెందిన జనార్ధన రావు (50) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టైలర్గాగా జీవనం కొనసాగిస్తున్నా అతను కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అప్పులు కాగా మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.