గుంటూరు: సీఎంకు వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే మాధవి

57చూసినవారు
గుంటూరు: సీఎంకు వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గంలోని పలు సమస్యలను, చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం, వాటికి సంబంధించిన వినతిపత్రాలను ఆయనకు అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు.

సంబంధిత పోస్ట్