ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ అశోక్ కుమార్ అన్నారు. గుంటూరు పట్టణంలో శనివారం సాయంత్రం ఇస్ట్ ట్రాఫిక్ పోలీసులు రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తోపుడుబండ్లను ఖాళీ చేయిస్తున్నారు. రోడ్డుపై వ్యాపారాలు పెట్టడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని పోలీసులు అన్నారు. అందుకే రహదారులపై ఎవరైనా తోపుడు బండ్లు పెడితే కఠిన చర్యలు తప్పవు అన్నారు.