గుంటూరుకు చెందిన బాలకృష్ణ, రమణమ్మ దంపతులు అనకాపల్లి జిల్లా పరవాడలో నివసిస్తున్నారు. ఏప్రిల్ 22న బాలకృష్ణ నిద్రిస్తుండగా, భార్య రమణమ్మ అతని ముఖంపై వేడి నూనె పోసి పరారైంది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితురాలిని అనకాపల్లిలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.