
ఆస్పత్రిలో కోలుకుంటున్న పవన్ చిన్న కుమారుడు
AP: సింగపూర్ ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చికిత్స పొందుతున్నాడు. నిన్న స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్కు గాయాలైన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో అత్యవసర చికిిత్స చేశారు. నిన్న రాత్రి పవన్, చిరంజీవి దంపతులు ఆస్పత్రికి చేరుకున్నారు. డాక్టర్లతో మాట్లాడి పవన్ వివరాలు తెలుసుకున్నారు. ఇవాళ మార్క్ను జనరల్ వార్డుకు మార్చారు. మరో 3 రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు.