16వ ఆర్థిక సంఘం బృందం గురువారం తిరుపతిలో పర్యటించి, అర్బన్ లోకల్ బాడీస్ ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంది. ఈ సమావేశంలో గుంటూరు మేయర్ షేక్ సజీల గారు గుంటూరు నగర అభివృద్ధి మరియు అవసరమైన నిధులపై ముఖ్యమైన సూచనలతో ప్రసంగించారు. కార్యక్రమంలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, సెక్రటరీ రిత్విక్ రాజానమ్ పాండే, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.