మంచి వైద్యం అందిస్తారనే భరోసా కల్పిస్తేనే రోగులు ఆస్పత్రికి ఎక్కువగా వస్తారని వైద్య సిబ్బందిని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. బుధవారం గుంటూరు రూరల్ మండలం ప్రత్తిపాడులోని కమ్యూనిటి హెల్త్ సెంటర్ సిహెచ్సిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ ఆస్పత్రితోపాటు ప్రాంగణాన్నీ పరిశుభ్రంగా ఉంచాలని, రాత్రివేళల్లో నర్సులు, హెడ్నర్సులు , అందుబాటులో ఉండాలని ఆదేశించారు.